Tuesday, April 23, 2024

కారు ప్రమాదం.. మాజీ ఎంఎల్ఎ కు గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మాజీ ఎంఎల్ఎ, దివంగత ఎంఎల్ఎ శేశిరెడ్డి సతీమణి నీరజారెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. నీరజారెడ్డికి కర్నూల్ లోని శ్రీ చక్ర హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కారు టైరు పేలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News