Friday, March 29, 2024

బొలెరోను ఢీకొన్న కారు… ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Car, Bolero Accident: couple including daughter killed

 

లారీని ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పిన వాహనం
నలుగురిలో ముగ్గురు ఆస్పత్రి మార్గంలో మృతి
జోగులాంబ జిల్లా ధర్మవరం స్టేజీ వద్ద ప్రమాదం

జోగులాంబ గద్వాల్ : కారు, బొలేరో ఢీకొన్న ఘటనలో దంపతులతో పాటు వారి కుమార్తె దుర్మరణం పాలైన ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా ధర్మవరం సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాతీయ రహదారిపై లారీని తప్పించబోయిన ఓ కారు.. అవతలి వైపు రోడ్డుపై వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని దంపతులు మురళీ మోహన్ రెడ్డి, సుజాత, తో పాటు వారి కుమార్తె నేహా రెడ్డి, కుమారుడు సూర్యతేజకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మోహన్ రెడ్డి, సుజాత.. ఆస్పత్రిలో నేహా రెడ్డి మృతి చెందారు. సూర్యతేజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోదండపురం ఎస్సై కృష్ణయ్య ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News