Tuesday, April 23, 2024

రాంగ్ రూట్లో వచ్చి బైక్ ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Car came on wrong route and collided with bike :One died

 

యాదాద్రి భువనగిరి: ఆత్మకూర్ మండలం రాయిపల్లి ఓవర్ టర్నింగ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో రాంగ్ రూట్ లో వచ్చిన కారు, బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆత్మకూర్ మండలం రాఘవపురం గ్రామానికి చెందిన ఆటోమెకానిక్ సాగర్ మృతి చెందాడు. గత కొన్ని సంవత్సరాలుగా మోత్కూర్ లో ఆటో మెకానిక్ గ్గా సాగర్ పనిచేస్తున్నాడు. సాగర్ ద్విచక్ర వాహనంపై రాయిపల్లి వైపు వెళ్తున్న సమయంలో ఎదురుగా అతివేగంతో రాంగ్ రూట్ లో వచ్చిన కారు, ఢీ కొట్టి సుమారుగా 30 మీటర్ల దూరం ఈడ్చుకెల్లింది. స్పాట్ లొనే సాగర్ మృతి చెందాడు. కారు బీభత్సానికి మరో ఆటో పల్టీ కొట్టింది. మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Car came on wrong route and collided with bike :One died

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News