- Advertisement -
హైదరాబాద్: కారు అదుపుతప్పి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన సంఘటన ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం జవహర్నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కారు అతి వేగంగా వచ్చి ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -