Friday, April 19, 2024

వ్యక్తిని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. కారు వ్యక్తిని ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లిన సంఘటన శుక్రవారం తెల్లవారు జామున ఢిల్లీలోని కేశవపురంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే .. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున స్కూటర్‌ను కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.

ఈ ఘటనలో వ్యక్తి కారు బానెట్‌పై పడడంతో 350 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. 19 మరియు 21 సంవత్సరాల మధ్య వయస్సు గల ఐదుగురు విద్యార్థులు మద్యం మత్తులో వివాహ వేడుక నుండి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News