Thursday, April 25, 2024

ములుగు జిల్లాలో కారు బోల్తా: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Car overturns in Mulugu district: Two killed

హైదరాబాద్: ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం నార్లాపూర్ శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వనదేవతల దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు జంగాలపల్లికి చెందిన యుగంధర్, లింగమూర్తిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News