Thursday, April 25, 2024

పోలీసులు వెంబడిస్తున్నారని… గుట్కా తరలిస్తున్న కారు బోల్తా

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: గుట్కా తరలిస్తున్న కారు బైక్ ను ఢీకొట్టి బోల్తాపడిన సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో కారును ఆపకుండా డ్రైవర్ అతి వేగంగా వెళ్లి బైక్ ను ఢీ కొట్టిన అనంతరం అదే వేగంతో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్తు ట్రాన్స్ ఫ్రార్మర్ ఢీకొట్టడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ నుంచి జగిత్యాలకు గుట్కా తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News