Friday, April 26, 2024

వాగులో కొట్టుకుపోయిన కారు: నవ వధువు, వరుడి సోదరి మృతి..

- Advertisement -
- Advertisement -

Car washed in Thimmapur Vagu in Vikarabad

వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయిన సంఘటనలో నవ వధువు ప్రవల్లిక తోపాటు వరుడి సోదరి శ్వేతా మృత దేహాలు బయట పడ్డాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందిన నవదంపతులు నవాజ్‌రెడ్డి, ప్రవళిక కారులో మోమిన్‌పేట్ మీదుగా రావులపల్లి వెళుతుండగా తిమ్మాపూర్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో నవ దంపతులతో పాటు  నవాజ్‌రెడ్డి అక్కలు రాధమ్మ, శృతి, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డిలు ఉన్నారు. నవాజ్‌రెడ్డి, రాధమ్మ వరదలో నుంచి బయట పడ్డారు.

Car washed in Thimmapur Vagu in Vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News