హైదరాబాద్: డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై ఓ నర్సు రాయదుర్గం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సుగా పనిచేస్తున్న రంగమ్మ గత ఏడాది రాజేశ్కు రూ. 55లక్షలు, సింహాచలం రూ. 15లక్షలు ఇచ్చింది. నెల రోజుల్లో రెట్టింపు డబ్బులు ఇస్తామని, అధిక వడ్డీ ఆశ చూపడంతో డబ్బులు ఇచ్చానని బాధితురాలు చెప్పింది. తీరా డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బులకు బదులు ప్లాట్లు రాసిస్తామని చెప్పి శంషాబాద్లోని ఓ లాడ్జికి పిలిపించి బెదిరించారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కత్తితో బెదిరించడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారని ఆరుగురు నిందితులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.
case against the two who threatened nurse