- Advertisement -
హైదరాబాద్: బిజెపి ఎంపి తేజస్వి సూర్యపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే లోపలికి వచ్చాడని రిజిస్ట్రార్ ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా నగరానికి వచ్చిన బిజేవైఎం తేజస్వీ సూర్య ఉస్మానియా యూనివర్సిటీలో సభ నిర్వహించేందుకు వెళ్లారు. దీంతో పోలీసులు యూనివర్సిటీలోకి వెళ్లకుండా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. బిజేపి కార్యకర్తలు, ఎంపి సూర్య కలిసి వాటిని తొలగించి లోపలికి వెళ్లాడు. ఓయూ ఆర్ట్ కాలేజీ వద్ద సమావేశం నిర్వహించాడు. ఎంఐఎం ఎంపి అసదుద్దిన్పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి ప్రవేశించిన ఎంపిపై తేజస్వి సూర్యపై కేసు నమోదు చేశారు.
- Advertisement -