- Advertisement -
హైదరాబాద్: చైనా యాపులపై ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) రంగంలోకి దిగింది. ఆన్ లైన్ గేమ్స్ పేరిట చైనా యాప్స్ నిధులు మళ్లిస్తున్నాయి. హైదరాబాద్ లోని సిసిఎస్ లో చైనా యాప్ పై కేసు నమోదైంది. దీంతో కార్యకలాపాలకు ఉగ్రవాద కోణం ఉందన్న అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సిసిఎస్ దగ్గరున్న వివరాలను ఎన్ఐఏ తీసుకుంది. దేశంలో నుంచి రూ. 2వేల కోట్లకు పైగా చైనాకు నగదు వెళ్లింది. దీంతో యాపుల పేరిట భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్టు ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. అనధికారికంగా రూ. వేల కోట్లు చైనాకు పలు కంపెనీలు తరలించాయి. ఇప్పటికే చైనా యాప్స్ పై ఇడీతో పాటు ఐటి విచారణ చేపట్టింది.
case registered against China App in Hyderabad
- Advertisement -