Friday, April 19, 2024

పబ్బులపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Case registered against pubs

శబ్ద కాలుష్యంపై ఫిర్యాదు

మనతెలంగాణ, హైదరాబాద్ : నిర్ధేశిత సౌండ్ కంటే ఎక్కువగా పెట్టి చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగిస్తున్న రెండు పబ్బులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లో ఉన్న రిపీట్ అండ్ రివోల్ట్ పబ్బు, కల్బ్ రోగ్ పబ్బు సౌండ్ ఎక్కువగా పెడుతుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాటిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు రెండు పబ్బులపై కేసు నమోదు చేశారు. హైకోర్టు నిబంధనలను పబ్బులు పాటించలేదని, దీంతో కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News