Saturday, April 20, 2024

వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఛార్జీషీట్

- Advertisement -
- Advertisement -

Vivekananda Reddy
కడప: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ పులివెందుల కోర్టులో ఛార్జ్‌షీటును దాఖలు చేసింది. వివేకానంద రెడ్డి హత్యకు నలుగురు కారణమని పేర్కొంది. గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిపై అభియోగాలు నమోదుచేసింది. నిందితులను సెప్టెంబర్‌లో అరెస్టు చేసినట్లు కోర్టుకు తెలిపింది. కాగా నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామని పేర్కొంది. వారిలో ఇద్దరికి కోర్టు ద్వారా బెయిలు మంజూరు అయినట్లు తెలిపింది. నాలుగు రోజుల క్రితమే దస్తగిరి ముందస్తు బెయిలు పొందాడని, సునీల్, ఉమాశంకర్ రెడ్డి ఇంకా కడప జైలులో రిమాండ్‌లో ఉన్నారని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News