- Advertisement -
మనతెలంగాణ/అమరావతి: కరోనా మహమ్మారిని నియంత్రణకు వినియోగించేందుకు సిఎం సహాయ నిధికి విరాళాలిస్తే 100శాతం పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఎపి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వి.ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేస్తున్న పోరాటానికి తమ వంతు కృషిగా ప్రభుత్వ ఉద్యోగులు, సెలెబ్రిటీలు, వ్యాపార ప్రముఖులు ఎపి సిఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలిచ్చే వారికి వందశాతం పన్ను మినహాయింపు ఇస్తూ ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Celebrities donates to AP CM Relief Fund
- Advertisement -