హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించి ప్రసిడెంట్ పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్స్, అవార్డులకు ఎంపికైన 12 మంది పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. ఈక్రమంలో ప్రసిడెంట్ పోలీస్ మెడల్ సాధించిన ఎడిజిపి బి.శివధర్రెడ్డి, ఇండియన్ పోలీస్ మెడల్స్ సాధించిన ఐపిఎస్ అధికారి అకున్సబర్వాల్, ఆదిలాబాద్ 2వ బెటాలియన్ కమాండెంట్ ఆర్.వేణుగోపాల్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఇక్బాల్ సిద్ధిఖి, 10వ బెటాలియన్ కమాండెంట్ పి.సత్యనారాయణ, నిజామాబాద్ టాస్క్ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి.ప్రతాప్, ఖమ్మం టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గంటా వెంకటరావు, నల్గొండ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సామా జయరాం, కొండాపూర్ 8వ బెటాలియన్ రిజర్వ్ ఇన్సెక్టర్ శ్రీరంగం రవీంద్రనాథ్, వరంగల్ సబ్ఇన్పెక్టర్ కె.సుధాకర్, పోలీస్ అకాడమీలోని అసిస్టెంట్ సబ్ఇన్సెక్టర్ ఎం.నాగలక్ష్మి, శంషాబాద్ ఎస్ఒటి అసిస్టెంట్ సబ్ఇన్పెక్టర్ ఆర్. అనితారెడ్డి, గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ డి.రమేష్బాబులు పతకాలు అందుకోనున్నారు.