- Advertisement -
న్యూఢిల్లీ : చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం అందించకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రం నాశనం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించే వార్తా కథనాన్ని ఆయన ట్విట్టర్లో జత చేశారు. పేదలకు రూ.10,000 వంతున ఆర్థిక సాయం నేరుగా అందించాలని, అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఇ) రంగాన్ని ఆదుకోడానికి ప్యాకేజి ప్రకటించాలని ఆయన సూచించారు. ఈ ఎంఎస్ఎంఇ రంగం అనేక మందికి ఉపాధి కల్పిస్తోందని, ఆయన అన్నారు.
- Advertisement -