- Advertisement -
మాదన్నపేట్ః నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఈ సంఘటన మంగళవారం సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం… భానునగర్కి చెందిన మాలతి(48) సైదాబాద్ కేశవ్ నగర్ మీదుగా తన స్నేహితురాలితో నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో అక్కడే మాటు వేసిన ఓ నిందిడుతు ఆమె మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కొన్ని బైక్ పై పారిపోయాడు. దుండగుడిని పట్టుకునే క్రమంలో బాధితురాలు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడ ఉన్న సిసి కెమెరాలు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు పోలీసులు తెలిపారు.
Chain snatching in Saidabad
- Advertisement -