Friday, April 26, 2024

జూన్‌లో సెట్స్

- Advertisement -
- Advertisement -

Chances to conduct Common Entrance Test in month of June

సంక్రాంత్రి తర్వాత షెడ్యూల్ విడుదల
కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యామండలి

హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సెట్స్) జూన్ నెలలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రవేశ పరీక్షలన్నీ జూన్ నెలలో నిర్వహించి జూలైలో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను జనవరి నెలలలో సంక్రాంత్రి తర్వాత విడుదల చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్, ఒమిక్రాన్ కేసుల పరిస్థితుల దృష్టా ఏప్రిల్ లేదా మే నెలలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించే అవకాశాలు. ఈ నేపథ్యంలో జూన్‌లో ఎంసెట్, ఇసెట్, లాసెట్, ఎడ్‌సెట్ తదితర ప్రవేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) నిబంధనలకు అనుగుణంగా సెట్స్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి జనవరి మొదటివారంలో ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిసింది. ముందుగా ఇసెట్ నిర్వహించి ఆ తర్వాత ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్షను నిర్వహించే అవకాశాలున్నాయి. ఆన్‌లైన్‌లో విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్న నేపధ్యంలో అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాలను చూసుకుని తేదీలు ఖరారు చేయనున్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే ఎంసెట్‌ను గత ఏడాది తరహాలోనే కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ సెషన్లలో నిర్వహించనున్నారు.

ఆలస్యంగా ప్రారంభం కానున్న విద్యాసంవత్సరం

కొవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కాగా, వచ్చే విద్యాసంవత్సరం కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ ముగుస్తున్నా ఇంకా కొన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాలేదు. ఎడ్‌సెట్, లాసెట్ కౌన్సెలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ తరగతులు ఆలస్యం కానున్నాయి. జనవరిలో పోస్టు గ్రాడ్యుయేషన్ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభించేందుకు యూనివర్సిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు జూన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే జూలై లేదా ఆగస్టులో కౌన్సెలింగ్ జరుగనుంది. ఆగస్టు చివరి నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తయితే సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News