Saturday, April 20, 2024

నేటి నుంచి చంద్రబాబు బస్సు యాత్ర

- Advertisement -
- Advertisement -

Chandrababu

అమరావతి:  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. బుధవారం ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని బొప్పూడిలో ఉదయం 11 గంటలకు చంద్రబాబు ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ బస్సుయాత్రకు ‘ప్రజా చైతన్య యాత్ర’ అనే పేరుపెట్టారు. కాగా ఈ యాత్ర 45రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలు, వార్డుల్లో కొనసాగనుంది. ‘తొమ్మిది నెలల్లో తొమ్మిది రద్దు, తొమ్మిది భారాలు, తొమ్మిది మోసాలతో నయవంచక పాలన’ అనే నినాధంతో ఈ యాత్రను చంద్రబాబు చేపట్టనున్నారు. ఎపిలో జగన్ పాలన, మూడు రాజధానుల అంశం, అమరావతిపై సిఎం జగన్ తీరును ప్రజాల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Chandrababu Naidu 45 days bus Yatra in Andhra Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News