హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఛార్జిషీట్ దాఖాలైంది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోసం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకోగా ఎక్సైజ్ శాఖ సమాధానం ఇచ్చింది. నగరంలో రెండుసంవత్సరాల్లో 12 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. అందులో ఎనిమిదింటిలోనే ఛార్జ్షీట్ దాఖలైంది. ఈ జాబితాలో 72 మంది పేర్లు ఉన్నాయి. అయితే టాలీవుడ్ కు సంబంధించిన నాలుగు కేసులపై ఎక్సైజ్ శాఖ సమాచారాన్ని ఇవ్వలేదని తెలుస్తోంది. జర్మనీ, బ్రిటన్, ఇంగ్లడ్ ల నుంచి డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఛార్జ్షీట్ లో ఎక్సైజ్శాఖ పేర్కొంది. ఎనిమిది చార్జిషీట్లలో కాలేజీ స్టూడెంట్స్తో పాటు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. టాలీవుడ్ కేసులో 72 మంది పేర్లు బయటపడటం సంచలనంగా మారింది. కాగా, బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకురావడం తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపింది.
Chargesheet filed in Hyderabad drugs case