- Advertisement -
అనంతపురం: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ఎరడికెర గ్రామంలోని పంటపొలాల్లో ఒక అద్దె విమానం అత్యవసరంగా దిగింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంధనం లీకేజీ అవుతుండడంతో ఒక అద్దె విమానం అత్యవసరంగా దిగినట్లు బ్రహ్మసముద్రం ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆయన చెప్పారు. జిందాల్ స్టీల్ కంపెనీ సీనియర్ అధికారి ఒకరు మైసూరు నుంచి బళ్లారిలోని జిందాల్ స్టీలు ప్లాంట్కు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పైలట్ ఎంతో చాకచక్యంగా విమానాన్ని పంట పొలాల్లో దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Chartered plane lands in Agri fields
- Advertisement -