Friday, March 29, 2024

గిఫ్టుల పేరుతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

Cheating in the name of gifts in hyderabad

బాధితులను నమ్మించి డబ్బులు కొట్టేస్తున్న సైబర్ నేరస్థులు
బహుమతి వచ్చిందని ఫోన్
ట్యాక్స్‌ల పేరుతో డబ్బులు వసూలు
నమ్మి మోసపోతున్న అమాయకులు

హైదరాబాద్: బహుమతుల పేరుతో సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. అమాయకులకు ఫోన్ చేసి బహుమతులు వచ్చాయని ఫోన్లు చేసి మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేయడంతో సైబర్ నేరస్థులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ముఠాలుగా ఏర్పడి అమాయకులకు ఫోన్లు చేస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ బాధితురాలికి ఫోన్ చేశారు, కొద్ది రోజులు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చేది ఉందని ప్రార్థన చేయాలని కోరాడు. దానికి బాధితురాలు అంగీకరించింది. కొద్ది రోజుల తర్వాత సైబర్ నేరస్థులు బాధితురాలికి ఫోన్ చేసి మీరు ప్రార్థనలు చేయడం వల్లే తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు. నీకు ఖరీదైన గిఫ్టులు, డాలర్లు పంపిస్తున్నానని చెప్పాడు. దీనికి బాధితురాలు సంతోషం వ్యక్తం చేసింది. తర్వాత నకిలీ కొరియర్ పంపిస్తున్నట్లు ఇన్‌వాయిస్ తదితరాలను పంపించాడు. కొరియర్ ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆగిందని కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాలని చెప్పాడు.

చెప్పిన మరుసటి రోజు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారిని ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. మీకు ఖరీదైన బహుమతులు వచ్చాయని, కస్టమ్స్, జిఎస్‌టి, క్లియరెన్స్ తదితర ఛారీజలను వెంటనే చెల్లించాలని చెప్పాడు. దీనిని నమ్మిన బాధితురాలు వారు చెప్పినట్లు దశలవారీగా రూ.12లక్షలు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసింది. అయినా కూడా సైబర్ నేరస్థులు మళ్లీ ఫోన్ చేసి డబ్బులు పంపించాల్సిందిగా కోరడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిరాదు చేసింది. బహుమతుల పేరుతో మోసం చేశారని గ్రహించింది. చింతల్‌కు చెందిన గాయత్రి అనే బాధితురాలి తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోంది. తల్లికి చికిత్స చేయించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సైబర్ నేరస్థులు ఫోన్ చేసి నీకు కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.25లక్షలు బహుమతి వచ్చిందని చెప్పారు.

దీంతో సంతోషం వ్యక్తం చేసిన బాధితురాలు తన తల్లి క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు పనిచేస్తాయని అనుకుంది. బహుమతిగా వచ్చిన డబ్బులను పంపించాలంటే ముందుగా వివిధ రకాల ట్యాక్స్‌లు చెల్లించాలని చెప్పారు. దీంతో బాధితురాలు సైబర్ నేరస్థులు చెప్పిన విధంగా దశలవారీగా రూ.8లక్షలు పంపించింది. అయినా కూడా మళ్లీ డబ్బులు పంపించాల్సిందిగా అడుగుతుండడంతో తాను మోస పోయానని గ్రహించిన బాధితురాలు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తార్నాకకు చెందిన బాధితురాలికి సోషల్ మీడియాలో పరిచయం అయిన నిందితుడు తాను యూకేలో డాక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరు తరచూ ఆన్‌లైన్‌లో ఛాటింగ్ చేసుకునేవారు. వివాహం అనంతరం బెంగళూరులో స్థిరపడుదామని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత వివాహం చేసుకుంటానని నమ్మించాడు.

యూకే నుంచి ఖరీదైన పార్సిల్‌ను పంపిస్తున్నానని చెప్పాడు. తర్వాత కొద్ది రోజులకు ఢిల్లీ కస్టమ్స్ అధికారులము మాట్లాడుతున్నామని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీకు పార్సిల్ వచ్చిందని జిఎస్‌టి తదితర ఛార్జీల కింద రూ.10,69,000 వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో బాధితురాలు ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో అనుమానం వచ్చిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు బాధితురాలిని మోసం చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎండి హసి ం అలియాస్ పప్పును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ఇండియాలోనే ఉంటూ యూకేలో ఉంటున్నానని చెప్పి మోసం చేశాడు.ఇలాగే సామాజిక మాద్యమాల్లో ఉంటే అమాయకులను టార్గెట్‌గా చేసుకుని మోసం చేస్తున్నారు.

గతంలో నైజీరియా ముఠాలు…

ఢిల్లీ కేంద్రంగా ఉండే నైజీరియాకు చెందిన ముఠాలు గతంలో ఇలాంటి ఆగడాలు చేసేవి. వీళ్లు చేస్తున్న సైబర్ నేరాలను చూసిన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖ్‌ండ్‌కు చెందిన నేరస్థులు ముఠాలుగా ఏర్పడి నేరాలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బాధితుల వివరాలు తీసుకుని వారికి ఫోన్ చేస్తూ మోసం చేస్తున్నారు. పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఎవరు సంప్రదించవద్దని చెబుతున్నా కూడా బాధితులు వినడం లేదు. తరచూ సైబర్ నేరస్థుల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొనకుండా బహుమతి ఎలా వస్తుంది. ఈ విషయం కూడా కనీసం తెలియకపోతే ఎలా అని పోలీసులు చెబుతున్నారు. అనుమానస్పద వ్యక్తులు సంప్రదిస్తే స్పందించవద్దని వెంటనే పోలీసులకు చెప్పాలని స్పష్టం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News