Tuesday, April 23, 2024

బోథ్ మండలంలో చెకుముకి టాలెంట్ టెస్ట్

- Advertisement -
- Advertisement -

 

బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బోథ్ లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పిటీసీ సంధ్యారాణి, సర్పంచ్ సురేందర్ యాదవ్, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, చేతుల మీదుగా ప్రశ్న పత్రాలు విడుదల చేశారు. విద్యార్థుల శాస్త్రీయ దృక్పథం విద్యార్థులలో పెంపొందించడం కోసం ఈ పరీక్ష నిర్వహహిస్తున్నట్లు తెలియజేశారు.

పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో వచ్చిన విద్యార్థులు ఈ మండల స్థాయిలో పరీక్ష నిర్వహించారు. మండల స్థాయిలో తెలుగు మాద్యమంలో ప్రథమ స్థానంలో జడ్.పి.యస్.యస్. బాలికలు బోథ్ ఇంగ్లీష్ మాద్యమంలో ప్రథమ స్థానంలో మోడల్ స్కూల్ బోథ్ కు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఈ.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సంజీవ్ రెడ్డి వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News