Friday, April 19, 2024

చెన్నై ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో దారుణం

- Advertisement -
- Advertisement -

Chennai GH woman contract worker arrested

చెన్నై: చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని న్యూరో సైకియాట్రిక్ వార్డ్ నుంచి అదృశ్యమైన 41 ఏళ్ల మహిళ కోవిడ్ -19 రోగి ఆసుపత్రి మైదానంలో చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. జూన్ 8తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్పత్రి ఒప్పంద ఉద్యోగిని చికిత్స పొందుతున్న కోవిడ్ రోగిని హత్యచేసింది. డబ్బు, సెల్ ఫోన్ కోసమే హత్య చేసినట్టు ఆ ఉద్యోగిని అంగీకరించింది. తిరువొట్టియూర్‌కు చెందిన రతి దేవి (40)ను హత్యచేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతురాలిని పశ్చిమ తాంబరంలోని కదపేరికి చెందిన ఎం.సునీతా (41)గా గుర్తించారు. నిందితురాలు, మృతురాలిని మూడవ అంతస్తులోని వార్డ్ నంబర్ 268 నుండి వీల్ చైర్లో తీసుకెళ్లినట్టు ఆసుపత్రి ఉద్యోగులు, రోగులు పోలీసులకు తెలిపారు.

Chennai GH woman contract worker arrested

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News