Thursday, April 25, 2024

కన్న బిడ్డలని గొడ్డలితో నరికి… తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కన్న బిడ్డలని గొడ్డలితో నరికి, తండ్రి ఆత్మహత్య చేసున్న దారుణ ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. నక్కలదిన్నె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి తన కుమారుడు రవితేజ, కుమార్తె పావని నిద్రిస్తుండగా వారి పై గొడ్డలితో దాడి చేశాడు. వారు తీవ్ర గాయాలపాలై కేకలు వేయగా గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిపై దాడి చేసిన అనంతరం నరసింహారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా నరసింహారెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News