Tuesday, April 23, 2024

మద్యం తాగొచ్చి గొడవ… తండ్రిని చంపిన కుమారుడు, కుమార్తె

- Advertisement -
- Advertisement -

Children killied their father in Adilabad

ఆదిలాబాద్: మద్యం తాగొచ్చి ప్రతి రోజు కుటుంబ సభ్యులను వేధిస్తుండడంతో తండ్రిని కుమారుడు, కూతురు కలిసి హత్య చేసిన సంఘటన ఆదిలాబాద్ మావల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బబ్బన్ భగత్ (50) అనే తన కుటుంబ సభ్యులతో కలిసి భగత్ సింగ్ నగర్‌లో నివసిస్తున్నాడు. భగత్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది. భగత్ ప్రతి రోజు మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడు. గురువారం పూటుగా మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కుమారుడు, కూతురు ఇనుప చువ్వతో తలపై బాదారు. తలకు బలమైన గాయం కావడంతో ఘటనా స్థలంలోనే అతడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ హరిబాబు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News