లక్నో: అల్లనేరేడు చెట్టు కింద కట్టేసిన బర్రెపై రాళ్లతో కొట్టొద్దని పిల్లలకు చెప్పినందుకు అతడిని చంపేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని డియోరియా ప్రాంతంలో జరిగింది. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ప్రకాశ్ అనే వ్యక్తికి బర్రె ఉంది. తన ఇంట్లో ఉన్న అల్లనేరేడు చెట్టుకు బర్రెను కట్టేశాడు. అల్లనేరేడు పండ్ల కోసం కొందరు పిల్లలు చెట్టుపై రాళ్లు విసిరారు. రాళ్లు బర్రెకు తగలడంతో వద్దని పిల్లలను హెచ్చరించాడు. పిల్లలు వినకపోవడంతో బూతులు తిట్టాడు. పిల్లల తల్లిదండ్రులు, బంధువులు అర్షద్, ఇస్తాక్ అన్సారీ, ముక్తార్ సితాబుద్దీన్, ముస్తాఖ్, సబీర్, పర్వేజ్, హయజ్, ఇస్లామ్లు ప్రకాశ్తో గొడవకు దిగడంతో పాటు అతడిపై రాళ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రకాశ్, అతడి కుమారుడు మనీష్, ఓం ప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశ్ తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి 11 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
అల్లనేరుడు పండ్లు తెచ్చిన తంటా…. వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -