Wednesday, April 24, 2024

ఆరు రోజుల తర్వాత శ్రీలంక రేవు నుంచి వెళ్ళిపోయిన చైనా నౌక

- Advertisement -
- Advertisement -

 

China Ship left SriLanka

కొలంబో: ఖండాంతర క్షిపణులు, శాటిలైట్ ట్రాకింగ్ నౌక  ‘యువాన్ వాంగ్ 5’ ఓడ వాస్తవానికి ఆగస్టు 11న చైనా నడుపుతున్న ఓడరేవుకు చేరుకోవాల్సి ఉంది, కానీ అది ఆలస్యంగా చేరుకుని అక్కడ తిష్టవేసింది. దీనిపై భద్రతాపరమైన ఆందోళనలను శ్రీలంకతో  భారత్ లేవనెత్తింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హంబన్‌తోట ఓడరేవు వద్ద తిష్ట వేసిన వివాదాస్పద  హైటెక్ చైనా పరిశోధన నౌక  ఆరు రోజుల పర్యటన తర్వాత సోమవారం శ్రీలంక జలాల నుండి బయలుదేరింది.

చైనా ఓడ ఆగస్ట్ 16న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:20 గంటలకు దక్షిణ శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవుకు చేరుకుంది. అది ఇంధనం నింపుకోవడం కోసం అక్కడ డాక్ చేయబడింది. ఓడ స్థానిక కాలమానం ప్రకారం నేడు సాయంత్రం 4 గంటలకు ఓడరేవు నుంచి బయలుదేరిందని హార్బర్ మాస్టర్ నిర్మల్ సిల్వా ఇక్కడ విలేకరులకు తెలిపారు. దీని తదుపరి ‘పోర్ట్ కాల్’ చైనా యొక్క జియాంగ్ యిన్ పోర్ట్‌లో ఉంటుందని అధికారులు తెలిపారు. నౌక పర్యటన సందర్భంగా ఇక్కడి చైనా రాయబార కార్యాలయం కోరిన అవసరమైన సహాయాన్ని శ్రీలంక అందించింది.

హంబన్‌తోట నౌకాశ్రయానికి నౌక రావడం వివాదాస్పదంగా మారింది, కొలంబో  అప్పులు చెల్లించడంలో విఫలమైన తర్వాత చైనా 2017లో శ్రీలంక నుండి ఓడరేవును 99 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. నగదు కొరత ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి ముందస్తు బెయిలౌట్‌ను కోరుతున్నందున దశలొో చైనీస్ పరిశోధనా నౌకను డాకింగ్ చేయడానికి కొలంబో  ఆమోదం చాలా కీలకంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News