Wednesday, April 24, 2024

తల్లికి చేపల ఫ్రై రుచి చూపించిన మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

Chiranjeevi Coock for his mother

గతంలో ఎన్టీఆర్ విసిరిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి పనులు చేసి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదేవిధంగా పెసరట్టు వేసి తన తల్లి అంజనా దేవి చేత తినిపించారు. ఈ వీడియో మెగాస్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆదివారం మరోసారి మెగాస్టార్ చిరంజీవి తన తల్లికి రుచికరమైన వంట చేసి తినిపించారు. అమ్మ కోసం స్పెషల్‌గా చింతకాయల తొక్కుతో చేపల వేపుడు చేశారు. చిన్నప్పడు మా అమ్మ స్పెషల్‌గా చింతకాయల తొక్కుతో చేపల ఫ్రై చేసేది… అంటూ అందుకే ఇప్పుడు తనకోసం నేను చేశాను మెగాస్టార్ చెప్పుకొచ్చారు. అలాగే ఆయన వండిన తీరును కూడా వివరించారు.

ఇక తల్లి అంజనా దేవికి చేపల వంటకం వడ్డించి… తింటుండగా బావుంది అంటుందో, ఏమంటుందో అని మెగాస్టార్ కాస్త సరదాగా కామెంట్ చేశారు. ఇక తల్లి చేపల ఫ్రై తిని బావుంది అనగానే మెగాస్టార్ హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ మంచి వంటగాడని ఇదివరకే పలుమార్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా స్పెషల్ పాత్రలో రాంచరణ్ కనిపించనున్నాడు.

Chiranjeevi Coock for his mother

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News