ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మొత్తం మూడు ప్రాజెక్టులను లైన్లో ఉంచారు. వాటిలో మొదటిది బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన ‘ఆచార్య’. కాగా మిగతావి రెండు రీమేక్స్ ఉన్నాయి. అయితే వాటిలో ‘లూసిఫర్’ చిత్రం పేరే ముందుగా వినిపించినప్పటికీ… ప్రస్తుతం చిరు ‘వేదాళం’ రీమేక్కు సన్నద్ధమవుతున్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. ‘లూసిఫర్’ రీమేక్ స్క్రిప్ట్ సుజీత్ నుంచి వి.వి.వినాయక్ దగ్గరకు వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే ‘వేదాళం’ రీమేక్ చేయనున్న దర్శకుడు మెహర్ రమేష్ కూడా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్టుగా తెలిసింది. కొన్ని కీలక మార్పులు చేర్పులు మెహర్ చేయగా చిరు వాటికి సానుకూలంగానే స్పందించినట్టు టాక్. దీంతో ‘ఆచార్య’ పూర్తయ్యాక ‘వేదాళం’ రీమేక్ను మొదలు పెట్టే యోచనలో చిరు ఉన్నట్టు సమాచారం.
Chiranjeevi to Remake Vedalam movie after Acharya?