Thursday, April 25, 2024

పునీత్ మరణం… షాక్ కు గురయ్యా: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) కన్నుమూశారు. పునీత్ జిమ్ చేస్తుండగా గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పునీత్ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపట్ల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పునీత్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మరణ వార్త వినగానే నోట మాట రాలేదని, షాక్‌కు గురయ్యానని చిరంజీవి తెలిపారు. చిన్న వయసులోనే పునీత్ ఇకలేరు అనడం తనకు బాధకు గురి చేసిందన్నారు. పునీత్ మరణం కుటుంబానికి, శాండల్ వుడ్‌కు తీరని లోటు అని అన్నారు. ఎప్పుడు బెంగళూరుకు వెళ్లిన పునీత్ తనని అప్యాయంగా పలికరించేవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News