- Advertisement -
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మరో బాలీవుడ్ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ కు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ‘చోక్డ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. రోషన్ మాథ్యూ, సయామీ ఖేర్ ప్రధాన పాత్రలలో ఈ మూవీని రూపొందించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఓ బ్యాంక్ క్యాషియర్ జీవితంలో జరిగిన ఊహించిన సంఘటనల నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించారు. ఆద్యంతం ఆస్తికరంగా రూపొందించిన ఈ ట్రైలర్ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. కాగా, జూన్ 5న ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు.
Choked Movie Trailer Released
- Advertisement -