Wednesday, April 24, 2024

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన వరుణ్ సింగ్ మృతి..

- Advertisement -
- Advertisement -

Chopper Crash: Group Captain Varun Singh passed away

బెంగళూరు: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి చెందారు. బుధవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈనెల 8న తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్‌రావత్(64), ఆయన భార్య మధులిక సహా 13మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11మంది ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్‌ను వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సింగ్ శరీరం 80 శాతంమేర కాలిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో ఈరోజు చికిత్స పొందుతూ మరణించారు.

Chopper Crash: Group Captain Varun Singh passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News