Tuesday, April 23, 2024

పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో మార్పు వచ్చింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

 

హైదరాబాద్: పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి విజయవంతమైందని మంత్రి కెటిఆర్ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలపై మంత్రి కెటిఆర్ సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో మార్పు దిశగా ఒక ముందడుగు పడిందని, పది రోజుల కార్యక్రమంతో పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజల్లో అవగాహన వచ్చిందని,  పట్టణ ప్రగతి విజయం సాధించిందని, పట్టణ ప్రగతి కోసం పని చేసిన ఉద్యోగులకు ధన్యవాదాలు అని, పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన అనేక దీర్ఘకాలిక సమస్యలను గుర్తించామన్నారు. గుర్తించిన సమస్యలను ప్రణాళిక బద్ధంగా పరిష్కరించామని కెటిఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

 

Cities developed with Pattana Pragathi says KTR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News