Thursday, April 25, 2024

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులను ఆదేశించారు. పదోతరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయాన్ని కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం నాడు పదోతరగతి పరీక్షల సన్నధ్ధతపై మంత్రి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వంద శాతం సిలబస్‌తో పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు చాయిస్ లేదని వెల్లడించారు.

ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్న పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పదోతరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. ఏదైనా సబ్జెక్టులో మెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలన్నారు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News