- Advertisement -
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ లోని విశ్వభారతి హైస్కూల్ లో విషాదం చోటుచేసుకుంది. టీచర్ కొడుతుందని భయపడి గత నెల 28న మహేష్ అనే ఎనిమిదవ తరగతి విద్యార్థి స్కూల్ భవనం పై నుంచి దూకాడు. తీవ్ర గాయాలైన మహేష్ ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేష్ శుక్రవారం చనిపోయాడు. హోంవర్క్ విషయంలో తోటి విద్యార్థులను మందలిస్తుంటగా చూసిన మహేష్ భవనంపై నుంచి దూకాడు. మహేష్ మృతితో కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
class 8 student jumps to death from school building
- Advertisement -