Saturday, April 20, 2024

వికాస్ దుబే మరో అనుచరుడి ఎన్‌కౌంటర్..

- Advertisement -
- Advertisement -

Close aide of Vikas Dubey killed in Encounter

కాన్పూర్‌ః గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే మరో అనుచరుడు ప్రభాత మిశ్రాను యుపి పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. బుధవారం కాన్పూర్‌లోని ఫరీదాబాద్‌లో ప్రభాత్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల కట్టడీ నుంచి తప్పించుకుపోవడానికి ప్రయత్నించిన మిశ్రాను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. నిన్న(బుధవారం) దుబే ప్రధాన అనుచరుడు అమర దుబేను పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

కాగా, కాన్పూర్‌లో 8మంది పోలీసులను విచక్షణారహితంగా కాల్చి చంపిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే, అతని అనుచరులు తప్పించుకొని తిరుగుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 40 బృందాలుగా విడిపోయి రౌడీ మూకల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో వికాస్‌ దూబే ముఠాకు చెందిన ఒక్కక్కరిని పోలీసులు హతమారుస్తున్నారు. హర్యానా, నోయిడాలో వికాస్ దుబే కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద పోలీసులను అప్రమత్తం చేశారు.

Close aide of Vikas Dubey killed in Encounter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News