Friday, March 29, 2024

నిజామాబాద్‌లో క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

అర్బన్ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు


మన తెలంగాణ/ నిజామాబాద్ : నిజామాబాద్ అ ర్బన్ ఎంఎల్‌ఎ బిగాల గణేష్‌గుప్తా క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా జ రిపారు. క్రిస్మస్ వేడుకలలో భాగంగా పాస్టర్ అసోసియేషన్ వారి ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్ కట్ చే సి క్రైస్తవ సోదరీసోదరుమణులకు క్రిస్మస్‌తోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ంఎల్‌ఎ బిగాల గణేప్తా వారికి నూతన దు స్తులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణరాష్ట్రం సిద్దించి టిఆర్‌ఎస్ ప్రభు త్వం వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ సౌజన్యంతో అ న్ని మతాలు, కులాల వారికి సమ ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. బతుకమ్మ పండగకుఇంటి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇస్తున్నారని, ముస్లింల కు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ పండగకోసం నూతనదుస్తులు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండగలను నిర్వహిస్తోందన్నారు. కాగా కరో నా, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకనుగుణంగానే నేడు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవల సి వస్తోందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కోసం రా ష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసం ప్రార్థనలు నిర్వహించాల ని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పాస్టర్స్ జో సెఫ్, డేవిడ్, జాన్సన్, సాలొమన్ రాజు, టిఆర్‌ఎస్ నాయకులు తారిక్ అన్సారీ, సుజిత్‌జింగ్ ఠాకూర్, స త్యప్రకాష్, సిర్ప రాజు, ఎ.మురళి, టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు, డైరెక్టర్లు డిఎంహెచ్‌ఓ రమేష్,దక్షిణ మండల తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News