Tuesday, April 23, 2024

ఆస్పత్రి నుంచి యడియూరప్ప డిశ్చార్జి

- Advertisement -
- Advertisement -

CM BS Yediyurappa discharged from Manipal Hospital

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. కోవిడ్-19 చికిత్స పొందుతూ బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుండి బిఎస్ యడియూరప్ప గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సిఎం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. 78 ఏళ్ల యడియూరప్ప ఏప్రిల్ 16న రెండోసారి కరోనా సోకి ఆసుపత్రిలో చేరాడు. గతేడాది ఆగస్టులో మొదటిసారి ఆయనకు కోవిడ్-19 సోకి, తొమ్మిది రోజుల తరువాత డిశ్చార్జ్ అయ్యాడు. మార్చి 12 న ఆయన కోవిడ్  వ్యాక్సిన్ మొదటి టీకా వేయించుకున్నారు. కాగా, దేశంలో కరోనా సెకండ్ వేవ్ జెట్ స్వీడ్ లో విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. గత 24గంటల్లో భారత్ లో మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

CM BS Yediyurappa discharged from Manipal Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News