- Advertisement -
సూర్యాపేట: కరోనా సమయంలో సిఎం కెసిఆర్ పేదలను ఆదుకున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. కరోనా పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎవరు కూడా ఆకలితో ఉండొద్దని బియ్యంతో పాటు నగదు కూడా అందజేశామని వివరించారు. వలస కార్మికులకు కూడా బియ్యం, ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1107కు చేరుకోగా 29 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 648 మంది కోలుకున్నారు. భారత దేశంలో కరోనా వైరస్ 53,175 మందికి సోకగా 1790 మంది మరణించారు. ఇండియాలో కరోనా నుంచి 15,393 మంది కోలుకున్నారు.
- Advertisement -