Friday, April 26, 2024

సెప్టెంబర్‌ నుంచి విశాఖలో మకాం: సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్‌లో విశాఖపట్నంకు మకాం మార్చనున్నట్లు, అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తానని ప్రకటించారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అని, రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ ప్రయత్నాల్లో భాగమేనని పునరుద్ఘాటించారు.

Also Read: త్వరలో హైదరాబాద్‌లో వార్డు పాలన పద్ధతికి శ్రీకారం: మంత్రి కెటిఆర్

విశాఖపట్నం పెద్ద నగరమే కాదు అందరికీ ఆమోదయోగ్యమైనది అని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సీఎం జగన్ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టుగా పిలిచే మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు గత నెలలో శంకుస్థాపన చేసిన సందర్భంగా కూడా ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News