Saturday, April 20, 2024

ప్ర‌జావైద్యుడు ల‌క్ష్మ‌ణ‌మూర్తి మృతిప‌ట్ల సిఎం సంతాపం

- Advertisement -
- Advertisement -

cm kcr condolence to doctor laxmana murthy death

హైద‌రాబాద్: ప్రముఖ ప్రజావైద్యుడు రామ‌క‌ లక్ష్మణ మూర్తి మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. లక్ష్మణ మూర్తి వైద్యం కోసం తన జీవితాన్ని అర్పించి పీపుల్స్ డాక్టర్‌గా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని సిఎం కొనియాడారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన ఆయన సేవలను తరతరాలు గుర్తు చేసుకుంటాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ల‌క్ష్మ‌ణ‌మూర్తి వరంగల్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. హుస్నాబాద్‌లో 1938 జూన్‌ 1వ తేదీన జన్మించిన రామ‌క‌ లక్ష్మణ మూర్తి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.

cm kcr condolence to doctor laxmana murthy death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News