Saturday, April 20, 2024

ప్రధాని తల్లి మృతిపై సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబసభ్యులకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. హీరాబెన్ మృతిపట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News