- Advertisement -
హైదరాబాద్: టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం.సుదర్శన్రావు కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సుదర్శన్ రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ తొలినాళ్లలో సుదర్శన్ రావు అద్భుతంగా పనిచేశారని సిఎం కెసిఆర్ గుర్తుచేసుకున్నారు. అయితే ఎం.సుదర్శన్రావు పలు పార్టీల నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు సంతాపం తెలిపారు.
CM KCR condoles death of Sudarshan Rao
- Advertisement -