Saturday, April 20, 2024

1500 మెగావాట్లు పడిపోయినా నిలిచిన గ్రిడ్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావుపై ప్రశంసలు
లైట్లు ఒకేసారి ఆర్పివేయడం వల్ల1500 మెగావాట్ల డిమాండ్ పడిపోయింది

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ పోరుకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేసినా విద్యుత్ కు సంబంధించి లాంటి ఇబ్బందులు లేకుండా చేసిన విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు. జెన్‌కో, – ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్ రావు, ఇతర డైరెక్టర్లు, ఇంజనీర్లకు ఈ సందర్భంగా సిఎం శుభాకాంక్షలు తెలిపారు. అంచనా వేసిన దానికన్నా భారీగా డిమాండ్ పడిపోయినప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరించి బ్యాలెన్స్ చేయగలిగారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ఒకేసారి విద్యుత్ దీపాలు ఆర్పినప్పటికీ, విద్యుత్ శాఖ పక్కా వ్యూహంతో వ్యవహరించడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదన్నారు. ఒకే సారి పెద్దమొత్తంలో విద్యుత్ వినియోగంలో మార్పులు సంభవించినప్పటికీ, ఉత్పత్తి – సరఫరా మధ్య పూర్తి స్థాయి సమతూకం సాధించడంలో జెన్ కో, ట్రాన్స్ కో పూర్తిస్థాయిలో విజయం సాధించాయని ప్రశంసించారు.

ఆదివారం ఉదయం నుంచి జెన్ కో,- ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ లోనే ఉండి విద్యుత్ డిమాండ్ ఒకేసారి పడిపోయినప్పుడు అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేశారన్నారు. దానికి అనుగుణంగా రాత్రి 9 నుంచి 9 నిమిషాల పాటు వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల 300 నుంచి 500 మెగావాట్ల డిమాండ్ పడిపోయే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనా వేసిందన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల రాష్ట్రంలో 1500 మెగావాట్ల డిమాండ్ పడిపోయిందని సిఎం తెలిపారు. పరిస్థితిని క్షణక్షణానికి పర్యవేక్షిస్తూ తగ్గిన లోడ్ ను బట్టి మరో చోట అదనంగా విద్యుత్ ఖర్చు చేసే వ్యూహం అనుసరించారని సిఎం పేర్కొన్నారు. తగ్గిన డిమాండును బ్యాలెన్స్ చేయడం కోసం నాగార్జున్ సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో, కాళేశ్వరం ప్రాజెక్టులో పంపుసెట్లు నడిపి విద్యుత్ ఖర్చు చేశారని తెలిపారు.

థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించడంతో విద్యుత్ ఉత్పత్తి- సరఫరాల మధ్య సమతూకం కుదిరిందన్నారు. అటు గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం కలగలేదు. మరోవైపు 9 గంటల 9 నిమిషాల నుంచి మళ్లీ డిమాండ్ పెరగడం ప్రారంభమయిందని సిఎం పేర్కొన్నారు. దీంతో ఇతర చోట్ల వినియోగాన్ని తగ్గించుకుని బ్యాలెన్స్ చేశారు. ఫలితంగా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆన్ చేసినా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని సిఎం కెసిఆర్ అన్నారు. సిఎండితో పాటు ట్రాన్స్ కో డైరెక్టర్లు టి.నర్సింగ్ రావు, జగత్ రెడ్డి, సూర్యూప్రకాశ్, జెన్ కో డైరెక్టర్లు సచ్చిదానందం, లక్ష్మయ్య తదితరులు పరిస్థితిని పర్యవేక్షించిన వారిలో ఉన్నారని, వారినందరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.

 

CM KCR Congratulations to CMD Prabhakar Rao
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News