- Advertisement -
అభినందించిన ఎంఎల్సి కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అన్నిరాష్ట్రాలను ఆకట్టుకోవడంతో పాటుగా చిత్రకారుల కుంచెలు కూడా స్పందిస్తున్నాయి. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఆర్టిస్టులు చిత్రాలు గీస్తున్నారు. తాజాగా రమావత్ సువర్ణ గీసిన చిత్రం ఎంఎల్సి కల్వకుంట్ల కవితను ఆకట్టుకుంది. కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రాన్ని ట్విట్టర్ వేదికగా కవితకు పోస్టు చేయగా ఎంఎల్సి కవిత అభినందించారు. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాల మధ్య సిఎం కెసిఆర్ రేఖా చిత్రన్ని విభిన్నపద్దతుల్లో చిత్రీకరించడం ఆర్టిస్టు నైపుణ్యానికి దర్పణం పడుతుంది.
- Advertisement -