- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా సామూహికంగా జరుపుకోలేక పోతున్నామని తెలిపారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో పరిమిత సంఖ్యలో ఆలయ పూజారులు, అధికారుల సమక్షంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సీతారాముల కల్యాణాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులు వీక్షించాలని సిఎం సూచించారు. లోకకల్యాణం కోసం సీతారాములు ఎన్నో త్యాగాలు చేశారు. భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని కెసిఆర్ పేర్కొన్నారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు.
CM KCR extends Sri Navami greetings to people
- Advertisement -