Friday, March 29, 2024

సకల సౌకర్యాల పాలనాసౌధం

- Advertisement -
- Advertisement -

CM KCR instructions on construction of a new secretariat

గతంలో మాదిరిగా అక్కడొకరు, ఇక్కడొకరు విసిరేసినట్లు ఉండొద్దు
ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అంతా ఒకే చోట విధులు నిర్వర్తించేలా ఉండాలి
తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింప చేసే విధంగా నూతన సచివాలయం
కొత్త సెక్రటేరియెట్ నిర్మాణంపై సిఎం కెసిఆర్ సూచనలు

హైదరాబాద్ : కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ భవన సముదాయం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపచేసే విధంగా రూపొందాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిలషించారు. అదే సమయంలో రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలన్నారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై సిఎం కెసిఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమీక్ష చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ కీర్తి ప్రతిష్టలను, సంస్కృతిని ప్రతిబింబించేలా సచివాలయం ఉండాలని సూచించారు. అదే సందర్భంగా పూర్తి సౌకర్య వంతంగా ఉండాలన్నారు.

సెక్రటేరియట్ నూతన భవన సముదాయం రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రధాన కార్యదర్శితో పాటు కార్యదర్శులు అంతా అందులోనే తమ విధులు నిర్వర్తించేలా ఉండాలన్నారు. గతంలో మాదిరిగా అక్కడొకరు ఇక్కడొకరు విసిరేసినట్లు ఉండొద్దు అని సూచించారు. మంత్రులు, కార్యదర్శులు ఒకే చోట ఉండాలన్నారు. సెక్రటేరియట్ సమీపంలోనే అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల సముదాయాన్ని కూడా నిర్మిస్తామన్నారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఒకే దగ్గర ఉంటుందని సిఎం కెసిఆర్ వెల్లడించారు.సెక్రటేరియట్ బాహ్య రూపం ఎంత హుందాగా, గొప్పగా ఉంటుందో లోపల కూడా అంత సౌకర్యవంతంగా, అన్ని వసతులతో ఉండాలని సిఎం కెసిఆర్ అన్నారు.

దీనికి సంబంధించి మంత్రులు, కార్యదర్శుల చాంబర్లు, సమావేశ మందిరాలు, సిబ్బంది కార్యాలయాలు, లంచ్ హాల్స్, సెంట్రలైజ్‌డ్ స్ట్రాంగ్ రూమ్, రికార్డు రూములు తదితరాలు ఎలా ఉండాలో నిర్ణయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ స్థలంలోనే ప్రార్థనా మందిరాలు, బ్యాంకు, క్రష్, విజిటర్స్ రూమ్, పార్కింగ్, భద్రతా సిబ్బంది నిలయం తదితర ఏర్పాట్లు ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించాలన్నారు. సౌకర్యాలు, సదుపాయాలు ఎలా ఉండాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకుని టెండర్లు పిలవాలని ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News