- Advertisement -
హైదరాబాద్: కొత్త విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ రాశారు. ఈ బిల్లు విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని సిఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లుపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సిఎం కెసిఆర్ ఆందోళన తెలుపుతూ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.
CM KCR Letter to PM Modi over New Power Bill
- Advertisement -