Thursday, March 28, 2024

యాదవ సోదరులపై కెసిఆర్‌కు ఎనలేని ప్రేమ అభిమానాలు: జగదీష్

- Advertisement -
- Advertisement -

CM KCR liked Yadav cast in Langamanthula jatara

 

సూర్యాపేట: కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలమైందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కన్నుల పండువగా పెద్దగట్టు లింగమంతులు జాతర జరుగుతుందన్నారు. జాతరలో పాల్గొని స్వామికి మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్‌ఎలు, కలెక్టర్లు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల సంతోషం పెద్దగట్టు జాతరలో కనిపిస్తోందని, యాదవ సోదరులపై సిఎం కెసిఆర్‌కు ఎనలేని ప్రేమ అభిమానాలున్నాయని, పెద్దగట్టు జాతరకు సిఎం కెసిఆర్ కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. సిఎం ఆదేశాలతో సకల సౌకర్యాలతో జాతర ఏర్పాట్లు చేశామని, శానిటైజేషన్ పనులకు మొదటి ప్రాధాన్యమిస్తూ జాతర పరిసరాలను శుభ్రం చేయించామన్నారు. సిసి కెమెరాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జగదీష్ రెడ్డి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News